మన్యం మనుగడ,పినపాక:
గోపాలరావుపేట గ్రామానికి అంతర్గత రహదారులు కేటాయించాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగాకాంతారావును మర్యాదపూర్వకంగా కలిసి, పినపాక మండల మీడియా సోదరులు వినతి పత్రం అందజేశారు. స్పందించిన రేగా కాంతారావు త్వరలోనే నిధులు కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మన్యం మనుగడ రీజినల్ మేనేజర్ కొత్త దామోదర్ గౌడ్, పినపాక మండలం మీడియా సోదరులు లింగారెడ్డి, సంతోష్, మల్లేష్, నాగేష్ , కోటి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: