మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగనేపల్లి గ్రామపంచాయతీ నుంచి సుమారు 50 మంది రైతులు మా పంట పొలాలకి చెక్ డాం కావాలని వినతి పత్రం ను ఎమ్మెల్యే రేగా కాంతారావుకు సమర్పించారు. తక్షణమే స్పందించిన రేగా కాంతారావు సంబంధిత అధికారులకు నిధులు మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయం పై రైతులు రేగా కాంతారావు కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆనంద వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సత్తిబాబు, టిఆర్ఎస్ నాయకులు వాసు బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు పోకలరాజాపతిరావు. మల్లిపెద్ద వెంకన్న, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బత్తుల చిన్న లక్ష్మీనారాయణ, ప్రజా ప్రతినిధులు గ్రామ రైతులు పాల్గొన్నారు
Post A Comment: