మన్యం మనుగడ, మంగపేట. :
ములుగు జిల్లా మంగపేట మండలంలో 46 వ రోజు కొనసాగుతున్న వీఆర్ఏ ల నిరవధిక సమ్మె. రోజు రోజుకు వీఆర్ఏ లు పిట్టల్లా రాలిపోతున్నారని ఇప్పటికి 25 మంది వీఆర్ఏ లు చనిపోయిన కూడా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరం. వీఆర్ఏ లందరికి పే స్కేల్, అర్హులైన వీ ఆర్ఏ లకు ప్రమోషన్లు మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ ల వారసులకు ఉద్యోగాలకు సంబందించిన జీ ఓ లు వీలైనంత తొందరగా ప్రకటించాలని లేకుంటే సమ్మెను ఉదృతం చేసి 23 వేల మంది వీఆర్ఏ లతో అసెంబ్లీని ముట్టడిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో వీఆర్ఏ ల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహమూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు , నర్సింహారావు,గౌసియా బేగం, సమ్మయ్య ,రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి,రాము, ఈశ్వరమ్మ, శ్రీను,మాధవి,ఖాజా హుస్సేన్,కార్తిక్,ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: