CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డిఎంకు వినతి

Share it:

 


గుండాల/ఆళ్లపల్లి సెప్టెంబర్ 9(మన్యం మనుగడ) ఇల్లందు నుండి మర్కోడ్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని మర్కోడ్ సర్పంచ్ కొమరం శంకర్ బాబు, ఆళ్లపల్లి సర్పంచ్ కోటేశ్వరరావు ఆర్టిసి డిఎం వెంకటేశ్వరరావును కోరారు. శుక్రవారం ఆళ్లపల్లి, మర్కోడు గ్రామాల్లో ఆర్టీసీ డిఎం వి వెంకటేశ్వరరావు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు మండల ప్రజలు పెద్ద ఎత్తున ఆర్టీసీ డిఎంకు బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యం ఆళ్లపల్లి మండలం నుండి ఇల్లందుకు, కాచనపల్లి బ్యాంకుకు ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారని బస్సు సౌకర్యం లేనందువలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని బస్సు సౌకర్యం కల్పించే విధంగా కృషి చేయాలని సర్పంచులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య, నడిమిగూడెం సర్పంచ్ నరసింహారావు, ఎస్సీ సెల్ అధ్యక్షులు వేమూరి రాంబాబు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు అతహార్, ఖయ్యూం, కాంగ్రెస్ నాయకులు సుబ్బారావు, బిజెపి నాయకులు శ్రీనివాసచారి, నరెడ్ల ప్రవీణ్ కుమార్, కరకపల్లి సుధాకర్, సురేందర్, తిరుమలేష్, సత్తార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు


Share it:

Post A Comment: