మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతల బయ్యారం గ్రామానికి చెందిన బొల్లె మహేష్ (26) అనే యువకుని మృతదేహం పాత రెడ్డిపాలెం గ్రామంలో నుండి ఎల్చిరెడ్డిపల్లి వెళ్లేదారిలో లభ్యమయింది. కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పాడని, తెలియజేశారు. విషయం తెలుసుకున్న ఏడూళ్ళ బయ్యారం ఎస్సై
టీవిఆర్ సూరి సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
Post A Comment: