గుండాల, సెప్టెంబర్ 22(మన్యం మనుగడ) : బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సాయనపల్లి ఎంపీటీసీ కృష్ణారావు మండలం పరిధిలోని చిన్న వెంకటాపురం గ్రామానికి చెందిన మల్లెల రవి అనారోగ్యంతో మృతి చెందడంతో అతని కుటుంబాన్ని పరామర్శించి ఒక కింట బియ్యాన్ని అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. భర్తను కోల్పోయి ఇద్దరు చిన్నపిల్లలతో అనాధగా మారిన రవి భార్య సుధారాణిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవరావు, ఉప సర్పంచ్ జగ్గారావు, సాగర్, సుతారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: