- మంగపేట మండలం లో ఘనంగా ఘనంగా వై ఎస్ ఆర్ వర్దంతి
- ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు చిరస్మరనీయుడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అద్యక్షులు మైల జయరాం రెడ్డి అధక్షతన శుక్రవారం మంగపేట మండల కేంద్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగ వారు టి.ఆర్.ఎస్ సెంటర్ లోని వై.ఎస్.విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈసందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టానికి కాంగ్రెస్ పార్టీ నేతృత్వoలో ముఖ్యమంత్రి గా వై.ఎస్.ఆర్ రెండు సార్లు గెలిచి,ముఖ్యమంత్రి గా ప్రజలకి ఎనలేని సేవ చేశారని అన్నారు. వారి హాయాo లోనే పేద ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారని, వారు పేదలకి ఎళ్ళ వేళలా గుర్తుండిపొయే మంచి పనులతో గుండెల్లో చిరస్తాయి ముద్ర వేసుకున్నారని అన్నారు అన్నీ వర్గాల ప్రజల కి ఉపయోగపడే సంక్షేమ రైతులకి ఏకకాలం లో రుణమాఫీ,ఉచిత విద్యుత్,పోడు భూములకు పట్టాలు పేద ప్రజలకు 108,104, ఇందిరమ్మ ఇల్లు,ఆరోగ్య శ్రీ,ఇందిర జల ప్రభ, ఫీజ్ రీయంబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారని వారు కొనియాడారు.జోహార్ వై. ఎస్.ఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమoలో పార్టీ మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, ఉపాద్యక్షులు తూడి భగవాన్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్,పార్టీ ప్రధానకార్యదర్శి అయ్యొరి యానయ్య, మైప లాలయ్య,అధికార ప్రతినిది బండ జగన్మోహన్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు ఛాద మల్లయ్య, బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, మైనార్టీ సెల్ అధ్యక్షులు హిదాయితుల్లా, మండల సోషల్ మీడియా ఇంఛార్జి కర్రీ నాగేంద్రబాబు, సీనియర్ నాయకులు చెట్టిపల్లి వెంకటేశ్వర్లు, కారుపొతుల నర్సయ్య,ఎస్.డి. సయ్యద్ హుస్సెన్, ఎంపెల్లి సమ్మయ్య,ఊక లక్ష్మయ్య,లంజపెల్లి నర్సయ్య,యూత్ నాయకులు కుర్సమ్ రమేష్,చెట్టిపల్లి ముకుందం,కోడెల నరేష్, బూర్గుల సతీష్, కస్పా ముకుందం, ముత్తినేని శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: