CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతుల ఇష్టం మేరకే సొసైటీని వద్దని తీర్మానం చేశాం : ఆయకట్టు చైర్మన్ రాములు

Share it:


గుండాల సెప్టెంబర్ 2(మన్యం మనుగడ) మెజార్టీ రైతుల ఇష్టం మేరకే సొసైటీ వద్దని తీర్మానం చేశామని ఆయకట్టు రైతు కమిటీ చైర్మన్ పునెం రాములు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ చెరువు కింద గిరిజనులకు, గిరిజన ఇతరులకు పొలాలు ఉన్నందున కలిసికట్టుగా మరమ్మత్తులు సమిష్టిగా చేపడుతామని అన్నారు. కొందరు తన స్వలాభం కోసం సొసైటీ చేయాలని పట్టుబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కొందరు తమ పిచ్చి రాతలతో గిరిజనులు గిరిజన ఇతరుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. సొసైటీ తీర్మానం చేస్తే తూముకు నీరు అందనప్పుడు మోటార్ల ద్వారా రైతులు వాడుకునే అవకాశాన్ని కోల్పోతారని ఆయన అన్నారు. రైతులకు మేలు జరగని సొసైటీ ఎందుకని మెజార్టీ ప్రజలు తీర్మానం చేశారన్నారు. ఇప్పటికైనా అది గ్రహించి తప్పుడు వ్రాతలు మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నబీ, ఇల్లందుల నరసింహులు, తెల్లం భాస్కర్ , జి సమ్మయ్య, అస్గర్, ఈ సమ్మయ్య, పి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: