మన్యం మనుగడ కరకగూడెం:సమాజంలోని నిరుపేదల కోసం ప్రతీ ఒక్కరం కలసి పని చేసి వారికి ఎదోరూపంలో సాయం చేసి అండగా ఉందామని ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా పిలుపునిచ్చారు.మండల పరిధిలోని పద్మాపురం గ్రామంలో గ్రామస్తులతో పాటు నిలాద్రిపేట వలస ఆదివాసీలకు దోమ తెరలను ఉచితంగా పంపిణీ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దని,దోమల వల్ల మలేరియా,డెంగ్యూ, పైలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నదున విధిగా దోమ తెరలు వాడాలని సూచించారు.అంతేకాకుండా
ప్రజారోగ్యం దృష్ట్యా ముఖ్యంగా డెంగ్యూ,మలేరియా నివారణలో భాగంగా పంపిణీ చేస్తున్నామన్నారు.వ్యాధులు ప్రబలకుండా వీటి వినియోగాన్ని గుర్తించాలని కోరారు.వేర్వేరు కార్యక్రమంలో సుమారు 50 మందికి దోమ తెరలు పంపిణీ చేశామని, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవ చేయడానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని తెలిపారు.రానున్న రోజుల్లో మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సమీర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: