మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రం నుంచి కొత్తగూడెం త్వరిత గతిన వెళ్ళలి అన్న, కొత్తగూడెం నుంచి అశ్వారావుపేట రావాలి అంటే పల్లెవెలుగు బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయ్ అవికూడా కొన్ని సర్వీస్ లు మాత్రమే తిరుగుతున్నాయి ఒక్క ఎక్సప్రెస్ సర్వీస్ కూడా లేదు, అశ్వారావుపేట నుండి కొత్తగూడెం ఎనభై కిలో మీటర్లు ఉండటం తో ఏవైనా పబ్లిక్ సర్వీస్ పరీక్షలు, లేదా గ్రూప్స్, ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు, బ్యాంకు పరీక్షలు అప్పుడు ప్రత్యేక బస్సుల ఊసే లేదు, బస్సు సర్వీస్ లు లేనందున ఒక రోజు ముందుగా లేదా ఉదయం 4 గంటలకు బయలుదేరి వెళ్ళాలి. అశ్వారావుపేట నుండి కొత్తగూడెం వెళ్లే మార్గం ఎక్కువ భాగం అడవి ప్రాంతం కావడంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కుకునూర్, భద్రాచలం రూట్ పాడవ్వటంతో ఎక్కువగా అశ్వారావుపేట పాల్వంచ రూట్ కీ రద్దీ పెరిగిన ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడంలేదు, ప్రజల సమస్యలు పట్టించుకున్న అధికారులు కానీ నాయకులు కానీ లేరు. మరి ప్రజా సమస్యల మీద ప్రశ్నించే వారే కరువయ్యారు. ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ వారికీ సమస్యలు తెలియ పరచి సమస్య పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
Navigation
Post A Comment: