CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల కేంద్రంలో విజయపురి కాలనీలో గత మూడు రోజులనుండి మంచినీరు లేక రెడ్డెనక్కిన కాలానివాసులు

Share it:

 


👉 మండల కేంద్రంలో విజయపురి కాలనీలో గత మూడు రోజులనుండి మంచినీరు లేక రెడ్డెనక్కిన కాలానివాసులు

👉 సమస్యమను రెండురోజుల్లో పరిస్కరిస్తామానన్న స్థానిక సర్పంచ్ 

ములకలపల్లి:(సెప్టెంబర్11), మన్యం మనుగడ ప్రతినిధి:

మండలకేంద్రంలో లోని విజయపురి కాలనీ వాసులకు గత మూడు రోజులనుండి నీరు  రావడం లేదు . అక్కడి ప్రజలు రోజువారి కూలీ పనులు చేసుకుని జీవిస్తుంటారు.  మంచినీరు రాకపోవడం వల్ల వారు చాలా ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులకు సమాచారము అందించినా, స్పందించకపోవడం తో పాల్వంచ దమ్మపేట రహదారిపై మహిళలు, కాలనీ వాసులు ఖాళీ బిందెలతో రోడ్డు ఎక్కడం జరిగింది. నరాటి రమేష్ నాయకత్వంలో తాళ్లపల్లి శ్రీదేవి ,ఓకే వెంకటమ్మ , మూడే విజయ ,వనమా రమేష్,చిట్టి అనుముల సాయి ,నీలం నాగేషు ,విజయపురి కాలనీ మహిళలు పాల్గొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి విజయపురి కాలనీకి మంచినీరు అందించాలని మహిళలు కోరుతున్నారు.సమాచారం అందుకున్న స్థానిక  సర్పంచ్ వారితో మాట్లాడి రెండు రోజుల్లో సమస్యని పరిష్కరిస్తామని తెలిపారు. అప్పటివరకు ట్యాంకు ద్వారా కాలానివాసులకు నీరు అందిస్తామని  తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: