- చర్ల రఘు థియేటర్లో వీక్షకులకు కనీస సౌకర్యాలకు కల్పించాలి.
- కలెక్టర్ స్పందించి నిబంధనలు పాటించకుండా థియేటర్ నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మన్యం టీవీ చర్ల ;
చర్ల మండల కేంద్రంలోని రఘుథియేటర్ లోని సమస్యలు పరిష్కరించాలని ప్రజాపంధా పార్టీ ఆధ్వర్యంలో థియేటర్ ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రజాపంధా చర్ల మండల కార్యదర్శి కొండా.చరణ్ మాట్లాడుతూ రఘుథియేటర్ లో కనీస సౌకర్యాలు లేనందు వల్ల వీక్షకులు తీవ్ర ఇబంధులకు గురి అవుతున్నారని అన్నారు. సరిపడా బాత్రూమ్ లు లేవని, ఉన్న ఒక్కట్టి అపరిశుభ్రంగా ఉందని అన్నారు. బిల్డింగ్ పెచ్చులుడుపోయి ఎప్పుడు మీదపడాపోతుందో అన్నట్లు వున్నదని అన్నారు. వర్కర్ల కు కనీస వేతనాల చట్టం ప్రకారం ఇవ్వడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్ రేట్లు తీసుకోవడం, వెహికిల్ చార్జీలు తీసుకోవడం జరుగుతుందని, అన్నారు. తక్షణమే ఈ థియేటర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి వీక్షకులకు సౌకర్యాలు కలిపించాలని, కలెక్టర్ స్పందించి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తున్న యాజమాన్యం పై చర్యాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..
లేనియెడల పోరాటం ను ఉదృతం చేస్తామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో ప్రజాపంధా మండల నాయకుడు లంకా.వెంకట్, పాలెం.చుక్కయ్య, ముసలి.సతీష్, సభ్యులు శివ, నాని తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: