మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగపురం ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన హిందీ ఉపాధ్యాయురాలు చాంద్ బేగంను యంగ్ ఇండియన్ ఫౌండేషన్ కొత్తగూడెంలోని మున్సిపల్ కార్యాలయ సముదాయంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో తాను అంకితభావంతో చేస్తున్న సేవలకు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు చాంద్ బేగం కు శుభాకాంక్షలు తెలియజేశారు.
Navigation
Post A Comment: