మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లో చింతిరాల కాలనీ గ్రామానికి తైదల శివరాములు ఆటో మొబైల్స్ దళితబందు షాపులను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు దళిత బంధు పథకం ద్వారా యజమానులుగా మారడం అభినందనీయం. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి కుటుంబానికి రూ.లు 10 లక్షలు అందజేసిన మహానుభావుడు సీఎం కేసీఆర్.దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడింది. అర్హులైన లబ్దిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, జడ్పీటీసీ సూది రెడ్డి సులక్షణ రెడ్డి, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వేన్న అశోక్ కుమార్, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు,అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: