CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముంపు ప్రాంత బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత

Share it:

మన్యం మనుగడ ప్రతినిధి , అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామపంచాయతీ  లో రాజ్యసభ సభ్యులు ఎంపీ బండి పార్థసారధిరెడ్డి, ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వారి సహకారంతో గత కొన్ని రోజులు క్రితం  గోదావరి వచ్చి వరద ముంపుకు గురైనా 60 కుటుంబాల బాధితులకు 10 కేజీల బియ్యం, సర్పంచ్ కకా అశోక్, ఉప సర్పంచ్, టిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ సీఎం కేసీఆర్  తన సుపరిపాలన తో ప్రజల గుండెల్లో బలమైన స్థానం దక్కించుకున్నారు  అని అన్నారు.వరద ముంపు ప్రాంతం బాధితుల కు శాశ్వత పరిష్కారం కోసం 1000 కోట్ల రూపాయలతో  ఎత్తైన ప్రదేశాలలో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను చేపడుతుందన్నారు, భవిష్యత్తులో గోదావరి వరద ఉధృతికి గ్రామాలు మునగడం  ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.ఎత్తయిన కరకట్ట నిర్మాణం కోసం ప్రభుత్వం త్వరలోనే పనులు ప్రారంభిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కకా అశోక్, ఉప సర్పంచ్ సురేష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు మొగీళ్ళ వీరారెడ్డి, పగడాల రామిరెడ్డి, గాదే వెంకటేశ్వర్లు, వల్లపు కృష్ణ,సాంబా రెడ్డి, గ్రామ ప్రజలు, వరద బాధితులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: