CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలి - దిశా ఫౌండేషన్ సభ్యులు, ఆదివాసి సంఘాలు డిమాండ్

Share it:


మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డిపల్లి పంచాయతీ లోని మద్దెలగూడెం గ్రామంలో అమాయక గిరిజన యువతిపై జరిగిన ఘటన దారుణమని ఆ మానవ మృగాన్ని, కఠినంగా శిక్షించాలని, అశ్వాపురం దిశా ఫౌండేషన్ సభ్యులు, ఆదివాసి నాయకులు సోమవారం డిమాండ్ చేశారు. సోమవారం వారు అత్యాచారం జరిగిన, గిరిజన యువతిని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అదే గ్రామానికి చెందిన హనుమంతుల సర్వేశ్వరావు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి , అమాయకురాలైన మూగ గిరిజన యువతిని ,ద్వి చక్ర వాహనం పై ,ఎక్కించుకొని గ్రామ సమీపంలో గల అడవి ప్రాంతాన్ని తీసుకోని వెళ్ళి అత్యాచార నికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారి కోసం గాలించారని అన్నారు.అనంతరం అ వ్యక్తి ,గిరిజన యువతిని ఏమి తెలియనట్టుగా ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయాడని అన్నారు.గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి ని గ్రామంలో దేహశుద్ది చేసి,పోలీసులకు ఫిర్యాదు  చేశారని అన్నారు.ఈ మానవ మృగం పై ఎస్.టి,ఎస్.సి ,దిశ,వికాలంగుల‌ చట్టం,తదితర చట్టాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు.గిరిజన  యువతికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని అన్నారు.

ఈ కార్యక్రమం లో తుడందెబ్బ రాష్ట్ర నాయకులు అలెం కోఠి, జాతీయ ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం  జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర, మండల అధ్యక్షులు కొమరం శ్రీను, ఆదివాసీ ఐక్య వేదిక  న్యాయ సలహ దారుడు, దనసరి నర్సింహ మూర్తి, పాయం హనుమంత రావు,అశ్వాపురం దిశ ఫౌండేషన్ అధ్యక్షులు మద్దెల అనపూర్ణ,సెక్రటరీ సుజాత,సభ్యులు మల్లు స్వరూప,పసుపులేటి స్వర్ణ, మాలోతు సువర్ణ, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: