మన్యం టివీ దుమ్ముగూడెం::
మారాయి గూడెం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ సోయం భద్రయ్య అనారోగ్యంతో మృతి చెందడం సిపిఎం పార్టీకి తీరని లోటుని ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ ఎలమంచి రవికుమార్ తెలిపారు వారి మృతి దేహానికి జెండా కప్పి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు మార్యాయగూడెం ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్ గా అనేక అభివృద్ధి పనులు చేసిన వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందిన మాజీ సర్పంచ్ భద్రయ్య లేకపోవడం చాలా బాధాకరమని ఇకనుండి ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని తెలిపారు మారాయిగూడెం పరిధిలోని సాగునీరు కోసం చెరువులు అదేవిధంగా కరెంటు లేని గ్రామాలకు కరెంటు అందించడం మంచినీళ్లు బోర్లు వేపించడం ఎలా అనేక అభివృద్ధి పనులు చేసిన మహా నాయకుడు అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియ కోటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు చంద్రయ్య రాజమ్మ ఉపాధ్యక్షులు సోయం జోగారావు టీఏజీఎస్ మండల కార్యదర్శి స్థానిక సర్పంచ్ తిరుపతిరావు సిపిఎం పార్టీ నాయకులు వీరభద్రం నాగమణి వీరస్వామి అర్జున్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: