జూలూరుపాడు, సెప్టెంబర్ 29, (మన్యం మనుగడ ప్రతినిధి) టిఆర్ఎస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ చిన్న అల్లుడు జూపల్లి ప్రదీప్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నేడు దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్ నందు ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు జూలూరుపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో కదిలి వెళ్లి జూపల్లి ప్రదీప్ కుమార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, చౌడం నరసింహారావు, దుద్దుకూరి మధుసూదన్ రావు, ఎల్లంకి సత్యనారాయణ, ఎల్లంకి చిన్న నాగేశ్వరరావు, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, నార్వనేని పుల్లారావు, ధారావత్ రాంబాబు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, గుండిపిన్ని వెంకటేశ్వర్లు, ఎల్లంకి మధు, ఎస్.కె చాంద్ పాషా, పగడాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: