మన్యం మనుగడ ప్రతినిధి, చండ్రుగొండ : ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నతమైన విద్య లభిస్తుందని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ అన్నారు. బుధవారం తిప్పనపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రభుత్వ నుండి వచ్చిన దుస్తులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్య బోధన, ఉచితంగా పుస్తకాలు, దుస్తులు అందించడంతోపాటు మధ్యాహ్న భోజనం అందులో పౌష్టికాహారం అందించేలా మెనూ అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సుజాత, పంచాయతీ ఉపసర్పంచ్ ధారావత్ రామారావు, ఎస్ఎంసి చైర్మన్ దావూద్ మియా, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: