మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండల తెరాస పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ లో దావా రమేష్ 53,000,రాసాల సురేష్ 19,000,రాసాల సంజన 7,000,రాసాల సుశీల 24,000, జగ్గారం గ్రామనికి చెందిన, సురవయ్య 48,000 రూపాయల చెక్కులను స్వయంగా వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా కోడి అమరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో నిరుపేద కుటుంబాల్లో వెలుగులు,
నిరుపేద కుటుంబాలు వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నగదు మంజూరు చేసి భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే చేసి చూపిస్తున్నారు,పేదల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల తెరాస పార్టీ సీనియర్ నాయకులు కందుల కృష్ణార్జున రావు,చిలకా వెంకటరామయ్య,మండల మహిళా అధ్యక్షురాలు తోకల లత,మండల తెరాస పార్టీ ఉపాధ్యక్షురాలు కొదమూరి భారతి,నియోజకవర్గ యువజన విభాగం ఉపాధ్యక్షులు లంకెల రమేష్,జగ్గారం సర్పంచ్ సున్నం రాంబాబు,ఉప సర్పంచ్ ఆవుల వెంకన్న,కంసాని సత్యనారాయణ,మండల యువజన విభాగం ఉపాధ్యక్షుడు మామిడాల శివ, మండల తెరాస పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ ,యువజన నాయకులు దావా వీరస్వామి,బొబ్బల మహేష్,బతికా విజయ్,మల్లే సంపత్,ఏర్పుల నరేష్,కమ్మల వెంకటేష్,మల్లే శెంకర్,ఇల్లాటూరి హేమచంద్ర,చరణ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: