CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంఘీభావం తెలిపిన తుడుండెబ్బ ఆదివాసీల పైన ప్రజాప్రతినిధుల ప్రతిఘటన హేయమైన చర్య-మడకం చిట్టిబాబు

Share it:


  • సంఘీభావం తెలిపిన తుడుండెబ్బ
  • ఆదివాసీల పైన ప్రజాప్రతినిధుల ప్రతిఘటన హేయమైన చర్య-మడకం చిట్టిబాబు
  •  వలస గిరిజనేతరులు ఏజెన్సీ వదిలిపోవాలని పిలుపు-చిరంజీవి

మన్యం మనుగడ , నూగూరు వెంకటాపురం,సెప్టెంబర్22.

  ఆదివాసీ నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో వలస వాదులను ఏజెన్సీ నుండి పంపించాలని ,అనుమతులు లేని నిర్మాణాల పైన ఎల్టీఆర్ చేసి, సీజ్ చేయాలని గత 30 రోజుల నుండి మండలంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం తుడుండెబ్బ జిల్లా కార్యదర్శి మడకం చిట్టిబాబు,జిల్లా నాయకులు చిరంజీవి దీక్ష శిబిరానికి చేరుకొని సర్పంచి నర్సింహమూర్తి చేస్తున్న దీక్షకి సంఘీభావం తెలిపి పూలమాల వేశారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ బర్లగూడెం సర్పంచి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. నెల రోజుల నుండి ఒక ప్రజా ప్రతినిధి చేస్తున్న దీక్షకి ఆదివాసీ ప్రజా ప్రతినిధులు మద్దతు తెల్పకుండా ప్రజల పైన  తిరుగుబాటు చేయడం హేయమైన చర్య అన్నారు. ఆదివాసీల హక్కుల పైన మాట్లాడాల్సిన ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యహరించడం యావత్తు ఆదివాసీ సమాజం సిగ్గుతో తల దించుకొంటోంది అని అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేయని అధికారుల పైన ,చట్టాన్ని ఉల్లంఘించిన వలస గిరిజనేతరుల పైన తమ ప్రతాపం చూపించకుండా హక్కులు అమలు చేయాలని పోరాటం చేస్తున్న ఆదివాసీ ప్రజల పైన ప్రజా ప్రతినిధుల ప్రతాపం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఓటు వేస్తేనే ప్రజా ప్రతినిధులు అవుతారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపారు. బర్లగూడెం సర్పంచి చేస్తున్న ఉద్యమానికి ప్రజాప్రతినిధుల సహకారం ఉండకపోవొచ్చు ఏమో కాని, ఆదివాసీ ప్రజల మద్దతు,ఆదివాసీ సంఘాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. నర్సింహమూర్తి ఈ కాలంలో ఉన్న అరుదైన నాయకుడు అన్నారు. వలస గిరిజనేతరులు తక్షణమే ఈ ప్రాంతాన్ని వదిలి పోవాలని పిలుపునిచ్చారు. అధికారులు సమస్యని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఈ ఉద్యమానికి అన్ని ఆదివాసీ సంఘాల మద్దతు ఉన్నదని స్పష్టంచేశారు

Share it:

TELANGANA

Post A Comment: