జూలూరుపాడు , సెప్టెంబర్ 22, (మన్యం మనుగడ ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు పండుగ కానుకగా స్థానిక శాసనసభ్యులు చేతులు మీదుగా నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం నేటి నుండి గ్రామాలలోని పంచాయితీ కార్యాలయాలలో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీల చేతులు మీదుగా మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడంతో పంచాయతీ కార్యాలయాలో మహిళల సందడి నెలకొంది. పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్రం మోహనరావు, టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు లేళ్ళ గోపాలరెడ్డి, కాకర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, మాచినేనిపేట తండా ఎంపీటీసీ బానోత్ నీల, చిన్న, లాకావత్ రెడ్డి, అనంతారం గ్రామపంచాయతీ సర్పంచ్ యదళ్ళపల్లి కళాశ్రీ, రైతుబంధు మండల కోఆర్డినేటర్ యదళ్ళపల్లి వీరభద్రం, గుండెపుడి గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ నరసింహారావు తదితరులు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
Post A Comment: