మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామం లో స్థానిక సర్పంచ్ సోమిని శివ శంకర ప్రసాద్ అధ్యక్షతన నూతనంగా వచ్చిన 19 పెన్షన్లను గ్రామంలో అర్హులకు టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు కూన చిన్నారావు ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్న పంచాయతీ అయినా సరే ఇన్ని పెన్షన్లు రావటం చాలా సంతోషకరం అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణలొ జరుగుతున్న అభివృద్ధి వారి రాష్ట్రంలో కూడా జరగాలని కోరుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీటీసీ కోర్సిక రామక్రిష్ణ, సెక్రటరీ, గ్రామ పెద్దలు తోట వెంకటస్వామి, సంగీత, వీర్రాజు, వార్డు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: