జూలూరుపాడు సెప్టెంబర్ 5, (మన్యం మనుగడ ప్రతినిధి) వలస ఆదివాసులకు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ యంయల్ న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ లూథర్ విల్సన్ కు జూలూరుపాడు సబ్ డివిజన్ కార్యదర్సి ఏదులాపురం గోపాలరావు వినతి పత్రం అందజేశారు. వలస ఆదివాసులకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. మండల పరిదిలోనీ ఎలకలోడ్డు గ్రామ సమీపంలో గత రెండు సంవత్సరాలుగా వలస ఆదివాసులు నివసిస్తున్నారని, వారికి ఎటువంటి సౌకర్యాలు లేవని, వారికి కావలసిన కనీస మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఈ విషయంపై గతంలో స్థానిక తాహశీల్దార్ కి, జిల్లా కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేశామని, అయినా పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే వీరి సమస్యలను తీర్చాలని కోరారు. ఈ కార్య క్రమంలో మడివి కిశోర్, చుక్కయ్య, సునీల్, నంగా, ముయు, ఉంగా, జోగయ్య, తదితరులు పాల్గోన్నారు.
Navigation
Post A Comment: