CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి మండల గ్రామ సేవకుల అధ్యక్షులు పాగా బాబు

Share it:


మన్యం మనుగడ, మంగపేట.:

 ములుగు జిల్లా మంగపేట మండలంలో గ్రామ సేవకుల నిరవధిక సమ్మె 62 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు అయిన పాగ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సేవకులను మోసం చేస్తోందని, మాట ఇచ్చి తప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా గ్రామ సేవకులకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేసి వారి జీవితాలలో ఆనందాన్ని నింపాలని కోరారు.లేని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని,రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు,ఆమరణ నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సేవకుల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహమూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు,నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య , రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను , మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ, ముజాఫర్, వెంకట నర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు  పాల్గొనడం జరిగినది.

Share it:

TELANGANA

Post A Comment: