ములకలపల్లి: మన్యం మనుగడ ప్రతినిధి: మండలం లో గత 6.7 సంవత్సరాలనుండి ప్రభుత్వ పాఠశాలల్లో లల్లో స్వీపర్ గా తక్కువ వేతనం తో పనిచేస్తున్నా వర్కర్లను ప్రభుత్వం గుర్తించి మాకు తగిన న్యాయం చెయ్యాలని స్వీపర్లు ప్రభుత్వాని వేడుకుంటున్నారు.
మొదట్లో పాఠశాలలో జాయిన్ అయినప్పుడు జీతం 2000 రూపాయలు లేక,2500రూపాయలు ఇచ్చేవారని, ఇప్పుడు వారిని సమీప పంచాయతీ నుండి 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, పనిబారం ఎక్కువ జీతం తక్కువ ఉదయం.8.00 గంటలకు వెళ్లి సాయంత్రం 4.00గంటలకు వస్తున్నామని,అప్పటివరకు పాఠశాలలోనే ఉండాల్సి వస్తుందని, ఇంత తక్కువ జీతం మా కుటుంబాలను ఎలా పోసించుకోవాలని, కావున ఇకనైనా ప్రభుత్వం కానీ, సంభంధిత అధికారులు కానీ స్పందించిమాకు న్యాయం చేయగలరనీ వేడుకుంటున్నాము.
Post A Comment: