దమ్మపేట(ములకలపల్లి)మన్యం మనుగడ ప్రతినిధి:
మండలం లోని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మూడవరోజు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ,గత మూడు రోజులుగా స్థానిక మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగుతున్నాయని, పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అమలు పరచాలని, కార్మికులకు సగటు వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించాలని, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని,ప్రభుత్వ ప్రకటించే సెలవులు కూడా వీరికి అమలుపరిచలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లొ రాశులపల్లి పంచాయతీ కార్మికులు గండికోట కన్నారావు,ధర్మయ్య,రాజు,కొర్రయ్య, వెంకటేశ్వరరావు,సవలం రాజు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: