CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సమస్యల సాధన కోసమే వినియోగదారుల పరిష్కార వేదిక : ఫోరం చైర్మన్ సత్యనారాయణ

Share it:


గుండాల సెప్టెంబర్ 21(మన్యం మనుగడ) :  విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసమే పరిష్కార వేదికను నిర్వహించామని పరిష్కార వేదిక చైర్మన్ సత్యనారాయణ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ నందు ఏర్పాటుచేసిన పరిష్కార వేదికలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ పునరుద్ధరణ లోపాలు ఉన్న మీటర్లు క్రమబద్ధీకరించాలన్న, సర్వీస్ పేరు మార్చుకోవాలన్న ఈ వేదిక ద్వారా అన్ని సదుపాయాలను పొందవచ్చు అన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించే విధంగా  ఉపయోగపడుతుందన్నారు. ఈ సదస్సులో రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తిరుమలరావు, ఆర్ చరందాస్, ఎం నరేందర్, డి ఈ విజయ్, రెవిన్యూ అధికారి మురళి, డి ఈ కోటేశ్వరరావు, ఏఈలు రమేష్ బాబు, రవి, రాము, లైన్మెన్ రమేష్ విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: