మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, ఆసుపాక గ్రామం లోని పలు సమస్యల పరిష్కారం కొరకు గ్రామస్థులు బుధవారం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో అశ్వారావుపేట ఎంఎల్ఏ మెచ్చా నాగేశ్వరరావునీ కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా ప్రతి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని అశుపాకలో రెండు సీసీ రోడ్లు వేయించడం జరిగిందని, రానున్న రోజుల్లో అన్ని విధుల్లో సీసీ రోడ్లు పోపోస్తానని వారికి తెలిపారు. అలాగే మంచి నీటి సమస్య ఉందని తెలియజేయడంతో వెంటనే అధికారులతో ఎంఎల్ఏ మెచ్చా మాట్లాడారు ఈ సమస్యను 2 లేదా 3 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎలీషా, మణికంఠ, ఆది విజయ్, శ్యామ్, భార్గవ్, మల్లి, నాగు, రవీంద్ర, మనోజ్, వినోద్, షేకర్, డీ సాయి, బాలు, అబ్దుల్ కరీం, ఎలియాస్, కరీం, రాజేష్, బాబు తదితరులు ఉన్నారు.
Navigation
Post A Comment: