జూలూరుపాడు , సెప్టెంబర్ 8 , (మన్యం మనుగడ ప్రతినిధి) : సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఎన్నిక పట్ల జూలూరుపాడు సిపిఐ మండల సమితి తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పట్ల ప్రజల పక్షాన ఉండి పెద్దఎత్తున పోరాటాలకు నాయకత్వం వహించారని, రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నిక పట్ల సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, సిపిఐ జూలూరుపాడు మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శులు గార్లపాటి వీరభద్రం, ఎస్కే చాంద్ పాషా, ఎల్లంకి మధు, షేక్ నాగుల్ మీరా, చింత స్వరాజ్ రావు, కిలారి ముత్యాలు, పగడాల అఖిల్, యాస రోశయ్య, కొండ వీరయ్య తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Navigation
Post A Comment: