మండలంలోని నరసాపురం ఇసుక ర్యాంపులో గుమస్తాగా పనిచేస్తున్న సురేష్ పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి భద్రాచలం కు చెందిన సీరంశెట్టి సురేష్ ఇసుక ర్యాంపు నందు గుమస్తాగా పనిచేస్తుంటాడు దీనిలో భాగంగా గోదావరి వరదలకు ఇసుక మొత్తం దిబ్బలుగా ఉండి పొలాల్లోకి వెళ్లిపోగా జెసిబి సాయంతో దగ్గరుండి ఇసుకను మొత్తం లోడ్ చేయిస్తున్నారు ఈ క్రమంలో నిన్న రాత్రి 10 గంటల సమయంలో కూడా ఇసుకను జెసిబి సహాయంతో దగ్గరగా చేస్తుండగా నరసాపురం చెందిన వరుస శివరామకృష్ణ పూజారి సూర్యచంద్రరావు కన్నాయిగూడెం గ్రామానికి చెందిన బాలకృష్ణ ముగ్గురు వెళ్లి ఇసుకను దగ్గర చేయడానికి మీరు ఎవరు అంటూ సురేష్ ని కొట్టి దుర్భాసలాఢీ చంపుతామని బెదిరించారని,అలానే సురేష్ నుదుటిమీద గాయపరిచారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నర్సాపురం ఇసుక ర్యాంపు గుమస్తా పై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు..
మన్యం టీవీ, దుమ్ముగూడెం ::
Post A Comment: