మన్యం మనుగడ వాజేడు సెప్టెంబర్ 12. : ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతంలో భూమిపై పూర్తి హక్కులు కలిగిన ఆదివాసీలకు అన్యాయం జరిగిందని, ధర్మారం గ్రామ పంచాయితీ పరిధిలో భువనపల్లి గ్రామంలో సదరు ఆదివాసీలపై భూమి ఆక్రమించారని కేసు నమోదు చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్న గిరిజనేహరులపై చర్యలు తీసుకోవాలని ఏ యస్ పి, మండల అధ్యక్షులు టింగ బుచ్చయ్య అన్నారు.1/70 చట్టం అమలులోకి వచ్చిన తర్వాత గిరిజనేహరులకి భూమి పైన హక్కులు యవరు ఇచ్చారు.భువనపళ్లి గ్రామంలో గ్రామ కంఠంభూమి ఆదివాసీలకు పూర్తిగా హక్కులు కలిగిన ఉన్నారని చట్టం చెపుతుంది.తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆదివాసీలకు న్యాయం చేయాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ డిమాండ్ చేశారు.
Navigation
Post A Comment: