CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు పట్టాల జీవోతో రైతుల్లో ఆనందం...కెసిఆర్, రేగా చిత్రపటానికి పాలాభిషేకం

Share it:

 


గుండాల, సెప్టెంబర్ 13(మన్యం మనుగడ) : పోడు పట్టాల జీవోతో పోడు రైతుల్లో ఆనందం వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు రేగా కు ఇచ్చిన హామీ ప్రకారం పోడు రైతులకు పట్టాల కొరకు జీవో నెంబర్140 విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 21 వేల రూపాయల చెక్కును సాయన పల్లి గ్రామానికి చెందిన ఇర్ఫా పద్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య , లింగగూడెం సర్పంచ్ నరసింహారావు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: