మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పేదింటి కుటుంబాలకు కల్యాణ లక్ష్మి పథకం భరోసా కల్పిస్తుందని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. మంగళవారం మండల రెవెన్యూ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 18 మంది కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రతి పేదింటి యువతని ఆదుకోవాలని, ఆర్థిక ఇబ్బందులతో ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి ఆగిపోకూడదనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,ఓసీ లోని పేదింటి కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వర్ష రవికుమార్, జిల్లా రైతుబంధు కన్వీనర్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి, జెడ్పిటిసి కొణకండ్ల వెంకటరెడ్డి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, వైస్ ఎంపీపీ నరకుళ్ల సత్యనారాయణ, గోనుగుపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మాలోత్ బోజ్య నాయక్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధారా బాబు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఉప సర్పంచ్ బాబురావు, టిఆర్ఎస్ చండ్రుగొండ టౌన్ అధ్యక్షుడు సూరా వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: