CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వ వసతి గృహాలలో ఏఎన్ఎం లనునియమించాడు

Share it:


గుండాల సెప్టెంబర్ 20(మన్యం మనుగడ) మండలంలోని ప్రభుత్వ వసతి గృహములలో ఏఎన్ఎం లను ప్రభుత్వం నియమించాలని పి డి ఎస్ యు కొత్తగూడెం జిల్లా ఇర్ఫ రాజేష్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని ఇచ్చి అనంతరం ఆయన మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వారిని పర్యవేక్షించడానికి నర్సులు వసతి గృహంలోనే ఉంటే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయన్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రణదీప్, పవన్ కళ్యాణ్, భాస్కర్, సాయిరాం, రాజు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: