మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : తల్లి బిడ్డ ఆరోగ్యమే అంగన్వాడీల ప్రధమ ధ్యేయమని డిడబ్ల్యుఓ వరలక్ష్మి అన్నారు. మంగళవారం బెండాలపాడు పంచాయతీ కార్యాలయంలో జరిగిన పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. గ్రామాలలో నేడు అంగన్వాడిలు పౌష్టికాహార కేంద్రాలు తయారైనాయన్నారు. చిన్నారులకు వయస్సుకు తగ్గ బరువు ఉండేలా చూడాల్సిన బాధ్యత అంగన్వాడీ టీచర్లు, ఆయాల పైనే ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల బరువు తక్కువ ఉన్న విషయాన్ని గుర్తించి స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నిర్మలా జ్యోతి, ఐసిడిఎస్ సూపర్వైజర్ శకుంతల, రాణి, పూసం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి సతీష్, అంగన్వాడి టీచర్లు ఆయాలు,గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: