CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తప్పుడు వార్తలు రాస్తే సహించేది లేదు : న్యూ డెమోక్రసీ నాయకులు సీతారాములు

Share it:


గుండాల సెప్టెంబర్ 2(మన్యం మనుగడ) కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తప్పుడు వార్తలు రాస్తే సహించేదే లేదని న్యూ డెమోక్రసీ నాయకులు ముక్తి సత్యం, కోరం సీతారాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గుండాల ఊర చెరువుకు సంబంధించి గురువారం గ్రామ రైతుల మత్స్య శాఖ అధికారుల సమక్షంలోనే చాపల సొసైటీ వద్దని మెజార్టీ ప్రజలు తీర్మానించడం జరిగిందన్నారు. కొందరు మాత్రం సొసైటీ కావాలన్నా మెజార్టీ ప్రజలు వ్యతిరేకించడంతోనే సొసైటీ చేయలేదన్నారు .కానీ కొందరు పని కట్టుకొని తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు . ఎర్ర జెండా పార్టీలు కొందరు ప్రజా ప్రతినిధులు గిరిజనేతరుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారారని తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు అలాంటి వారిని సహించేదే లేదని హెచ్చరించారు. ఆ విలేఖరి ఆదివాసి సంఘాల నాయకులను అవమానించేలా వార్తలు రాయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ఉపేందర్, పార్షిక రవి, నరేష్ , వై వెంకన్న, లాలయ్య, ఈసం కృష్ణ , బానోతు లాలు, నరసింహ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: