మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఉప్పాక పంచాయతీలో ఓ రైతు వానలు లేక ఎండిపోతున్న తన పొలానికి నీరు పెట్టేందుకు నానా అవస్థలు పడుతున్నాడు. జూలై నెలలోనే వర్షాలు తమ ప్రతాపాన్ని చూపించాయి. అధిక వర్షాల కారణంగా ఆ సమయంలో పంటలు వేయని రైతులు ఇటీవలనే వరి నాట్లు వేయడం జరిగింది. గతంలో విపరీతమైన వర్షాలు పడి, ఇప్పుడు చినుకమ్మ అలకపూనింది. సరైన వర్షాలు లేక చేనుకు తడి లేక, ఆకాశాన్ని నమ్ముకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం నాడు ఉప్పాక గ్రామానికి చెందిన ఓ రైతు రోడ్డుకి అవతల వైపు గల తన పొలంకు నీరు పెట్టేందుకు, మరో వైపున పారుతున్న కాలువ నుండి నీటిని పొలంలోకి మళ్ళించేందుకు మహా అవస్థలు పడుతున్నాడు.
Post A Comment: