మన్యం మనుగడ , వాజేడు ,సెప్టెంబర్ 13 :
ములుగు జిల్లా,వాజేడు మండలం, చెరుకూరు గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర, జిల్లా,వెంకటాపురం, వాజేడు మండల నాయకుల సమావేశం జరిగింది.సంఘంలోని నాయకుల విధి విధానాలు నచ్చక ఆ సంఘానికి మూకుమ్మడిగా రాష్ట్ర కార్యదర్శి కాక నర్సింహారావు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రేగ గణేష్,కోశాధికారి చింత మోహన్,కార్యదర్శి పూనెం చంటి,ఆదివాసీ మహిళా సంక్షేమ పరిషత్ బొదెబోయిన స్వాతి,వెంకటాపురం మండల బాధ్యులు పాయం కృష్ణ, పూనెం ప్రతాప్, పర్షిక అనిల్,అజిత్,నర్సింహమూర్తి,వాజేడు మండల బాధ్యులు మొడెం సందీప్, పద్దం సుధాకర్,నాగేశ్వర రావు,కారం రాజబాబు రాజీనామా చేయడం జరిగింది.త్వరలోనే జాతి సంక్షేమం కోసం నూతన సంఘంలో పనిచేయనున్నట్లు బిర్సాముండా రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కాక నర్సింహారావు పత్రికా ముఖంగా తెలిపారు.
Post A Comment: