జూలూరుపాడు సెప్టెంబర్ 21, (మన్యం మనుగడ ప్రతినిధి) బుధవారం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ను బి ఎస్ పి పార్టీ నాయకులు తంబర్ల నరసింహారావు, కొత్తపల్లి నరసింహారావు లు కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
జూలూరుపాడు మండల శివారు కొమ్ముగూడెం గ్రామం నుండి భద్రాద్రి జిల్లా సరిహద్దు గ్రామమైన వినోబా నగర్ వరకు రాష్ట్రీయ రహదారి అంతా గుంతల మాయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, గుంతల కారణంగా యాక్సిడెంట్లు అవుతున్నాయని, ఈ విషయంపై అనేకసార్లు ఆర్ అండ్ బి శాఖ అధికారులకు ఎంత మొరపెట్టుకున్న రోడ్డు మరమ్మతులు చేపట్టడం లేదని ఎమ్మెల్యే రాములు నాయక్ కు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని, రహదారి మరమ్మత్తులు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Post A Comment: