CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి కుటుంబ సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాములు నాయక్..

Share it:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు ( మన్యం మనుగడ ప్రతినిధి) బుధవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రభుత్వం చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన  పధకాలు అద్భుతమైనవిగా పేర్కొన్నారు. రైతు బంధు, ఉచిత కరెంట్, ఆసరా ఫించన్లు, కల్యాణలక్ష్మీ, శాదీముబారక్, దళిత బంధు, వంటి పధకాలు రాష్ట్ర ప్రజలకు అందుతున్నాయని అన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తామని రాములు నాయక్ తెలిపారు. త్వరలోనే గిరిజన బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ప్రవేశపెట్టబొతున్నారని రాములు నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించని ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని, వారికి ప్రజలే బుద్ది చెబుతారని అయన అన్నారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, శాదీముబారక్  చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చెసారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ లూథర్ విల్సన్, ఎండిఓ తాళ్ళూరి రవి, రాష్ట్ర మార్కఫేడ్ వైస్ చైర్మెన్ బొర్రా రాజశేఖర్, జడ్పిటిసి కళావతి, ఎంపిపి సొని, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యల్లంకి సత్యనారాయణ, ఎంపిటిసిలు, రాజశేఖర్, మధుసూదనరావు, సతీష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, నాయకులు రోకటి సురేష్, గిరిబాబు, రాంబాబు, సర్పంచ్ లు విజయ, సావిత్రి, కిషన్ లాల్, నరసింహారావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: