మన్యం టివి, మణుగూరు: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించి అండగా నిలిచిన చరిత్ర సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలోని దరఖాస్తు చేసుకున్న పెన్షన్ దారురులకి అందరికీ పెన్షన్ మంజూరులో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు కి, ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సారథ్యంలో పెన్షన్ మంజూరులో చరిత్ర సృష్టించారని ఆయన అన్నారు. ఎన్నడు ఎరగని విధంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి అండగా నిలిచారని,వారి రుణం జన్మ జన్మకు తీర్చుకోలేమని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ కు ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రూ.2016 రూపాయల పెన్షన్ వృద్ధుల్లో, వికలాంగుల్లో,వితంతుల్లో,ఒంటరి మహిళల్లో ఎంతో ఆనందాన్ని నింపిందని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమం లో మండల అభివృద్ధి అధికారి కోట వీరబాబు,ఎంపీవో పి. వెంకటేశ్వరరావు,పిఏసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శులు రామిడి రామిరెడ్డి,మండలం లోని స్థానిక గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, స్ధానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: