ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి :
మండల కేంద్రంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం (RMPWA) సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు బండి కొమరయ్య ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ డి,రబ్బాని ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ ని ఎన్నుకొవడం జరిగింది. ఈ సందర్బంగా మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా బుగ్గ.విశ్వాస్ రావు, ఉపాధ్యక్షులు గా తిరువాయపాటి రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా డి.సత్యనారాయణ, సహాయ కార్యదర్శిగా ఎమ్.సుబ్రహ్మణ్యం, ప్రచార కార్యదర్శిగా కె. నాగరాజు, కోశాధికారిగా జి,సురేష్, మహేష్, మండల సలహాదారుగా, ఎస్ వెంకటేశ్వరావు, గౌరవ సలహాదారులుగా సి ఎచ్ గోపి, ఎన్,శ్రీనివాసరావు ను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ఆర్ ఎమ్ పిలు ఎస్.ఎమ్ సుబాని, వెంకటేశ్వరరావు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: