గుండాల , సెప్టెంబర్ (మన్యం మనుగడ) : ఏజెంట్ల సమ్మెతో ఎల్ఐసి కార్యక్రమాలు స్తంభించాయి ఉదయం నుండి ఏజెంట్లు సమైక్య సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఇల్లందు, కొత్తగూడెం కార్యాలయాల ముందు ఏజెంట్లు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లందు కార్యాలయం ముందు లియాపి అధ్యక్షులు సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు కార్యాలయంలోకి కస్టమర్లు ఎవ్వరు వెళ్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు కస్టమర్లు రాక ఏజెంట్లు సమ్మెలో ఉండటంతో కార్యాలయంలో లావాదేవీలు ఏమాత్రం జరగలేదు. ఏజెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని లియాపి అధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కె శ్రీనివాస్, ఏజెంట్లు పాల్గొన్నారు
Navigation
Post A Comment: