మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,శేషగిరి నగర్ కు చెందిన టిఆర్ఎస్ పార్టీ ఓబి వర్కర్స్ యూనియన్ నాయకులు బాపనపల్లి మహేష్ తండ్రి రంగయ్య ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసం కి వెళ్లి దశదినకర్మలకు హాజరై, మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.అనంతరం మణుగూరు మండలం శేషగిరి నగర్ కు చెందిన భూక్య మంగమ్మ ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి దశదినకర్మలకు హాజరై మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మణుగూరు మండలం, శేషగిరినగర్ కు చెందిన ఈదునూరి అంజయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి దగ్గర ఉంటున్న వారిని,వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పిఎసిఎస్ అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కార్యదర్శి నవీన్, రామిరెడ్డి,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు, రమణ,రామకోటి,శంకర్ యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: