గుండాల, సెప్టెంబర్6, (మన్యం మనుగడ) ; తుడుం దెబ్బ రాష్ట్ర మాజీ కార్యదర్శి జవ్వాజి లక్ష్మీనారాయణ ఆశయ సాధనలో పనిచేస్తామని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పూనెం శ్రీను అన్నారు. మంగళవారం జవాజి నాలుగోవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు గిరిజనుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారన్నారు. గుండాల మండలంలో గిరిజనుల కోసం అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారన్నారు సింగరేణి ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు. ఆదివాసీ యువతరం జవ్వాజి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వజ్జ ఎర్రయ్య గోవింద నరసింహారావు, కన్నయ్య, మల్లయ్య, కిషన్ రావు, రుషి , బొబ్బిలి రమేష్ , ఎస్కే అస్గర్, కృష్ణ , ముకుందా చారి, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: