మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన అశ్వారావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరరావు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గంలో నర్సరీలకు విద్యుత్ సబ్సిడీ కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి వినతి పత్రాన్ని సమర్పించారని, దానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకుకులకంగా స్పందించి తప్పకుండా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఎంఎల్ఎ మెచ్చా తెలిపారు. అదే విధంగా విఆర్ఎల సమస్యల గురించి, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు గురించి, పలు చోట్ల వంతెనల నిర్మాణం గురించి, పంచాయతీ కార్మికుల సమస్య గురించి, అలాగే అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనులను మరియు ఆర్టిఓ కార్యాలయ ఏర్పాటు మరియు ఇతర కార్యాలయాలు ఏర్పాటు పనులను ముమ్మరం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరినట్లు అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా తెలిపారు.
Navigation
Post A Comment: