మన్యం మనుగడ, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జాతీయ సమైక్యత వేడుకలు ఘనంగా నిర్వహించారు. సహకార సంఘం చైర్మన్ రవి వర్మ జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ సమైక్యత వేడుకలలో భాగస్వామలం అయినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, సీఈవో సునీల్, ఎంపీటీసీ చింతపంటి సత్యం, డైరెక్టర్లు కొండేరు రాము, గునిగంటి సమ్మయ్య, మల్లా భూషణం, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దాట్ల వాసు బాబు, బొలిశెట్టి నరసింహారావు, సహకార సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: