- ఆదివాసీ నేతకు దక్కిన అరుదైన గౌరవం...
- కొమరం భీమ్ భవన ప్రారంభోత్సవానికి కేసీఆర్ నుండి పిలుపు...
- ప్రభుత్వ హెలికాప్టర్ లో హైదరాబాద్ కు పయనమైన రేగా....
మన్యం మనుగడ, డెస్క్:
పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన రేగా కాంతారావు అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వంలో విప్ గా తన స్థానాన్ని పెంచుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ఒక అందలం ఎక్కారు. కొన్ని రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెరాస బాధ్యతలు మోసేందుకు, తెలంగాణ ప్రభుత్వం జిల్లా అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేలలో రేగా కాంతారావు తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాదు నడిబొడ్డున ప్రత్యేకంగా ఆదివాసుల సమావేశం కొరకు ఏర్పాటు చేసిన కొమరం భీమ్ భవన ప్రారంభోత్సవానికి రేగా కాంతారావుకు తెలంగాణ ప్రభుత్వం నుండి ప్రత్యేక ఆహ్వానం అందింది . సెప్టెంబర్ 17 జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జెండా వందనం చేయవలసి ఉండగా, అదే రోజున హైదరాబాదులో కొమరం భీమ్ భవన ప్రారంభోత్సవం ఉన్న సందర్భంలో రేగా కాంతారావు కు ఉన్న ఆహ్వానం మేరకు సమయాభావం కలగకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కొత్తగూడెం నుండి ప్రత్యేక హెలికాప్టర్ ను రేగా కాంతారావు కోసం కేటాయించింది. ఈ విషయం గురించి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఆదివాసీ నేతకు ఒక అరుదైన గౌరవం దక్కిందని, ముఖ్యమంత్రి మాత్రమే ప్రయాణించడానికి వీలుగా ఉన్న హెలికాప్టర్ ను ఆదివాసి బిడ్డ ప్రయాణం కోసం కేటాయించడం ఆనందంగా ఉందని తెలియజేస్తున్నారు. శనివారం రోజున కొత్తగూడెంలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం, హెలికాప్టర్ లో హైదరాబాద్ కు రేగా పయనమయ్యారు.
Post A Comment: