ములకలపల్లి, మన్యం మనుగడ ప్రతినిథి: మండల కేంద్రంలో రజక వృత్తిదారుల సంఘం కుప్పిల ప్రదీప్ జిల్లా కమిటీ సభ్యులు , కందుకూరి రాంబాబు మండల నాయకుల అధ్యక్షతన సత్తెనపల్లి రామకృష్ణ 22వ వర్ధంతి జరిగింది.ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు పాల్గొని మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యమ అమరవీరుడు మన రజక బిడ్డ సత్తెనపల్లి రామకృష్ణ ప్రాణ త్యాగమే నేడు రైతులు పేదలు ఉచితంగా విద్యుత్ పొందుతున్నారని,ఈ పథకాలను కేంద్రం లో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వ నూతన విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లు తెస్తుందని,విద్యుత్ ఉద్యమ అమరవీల స్ఫూర్తితో విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు అదే విధంగా జిల్లాలో ఉన్న రజకులందరూ ఉచిత విద్యుత్ పథకాలను ఉపయోగించుకోవాలని, ఈ పథకాన్ని కేటగిరీ 2 నుండి క్యాటగిరి ఫోర్ గా మార్చాలని రజకులకు రజక బందు కింద పది లక్షల రుణాలు ఇవ్వాలని,ప్రత్యేక రక్షణ చట్టం ఇవ్వాలని,రజకులకు కేటాయించిన ఇనాం భూములకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రజకులకు ప్రత్యేక రుణాలు ఇచ్చి ఆదుకోవాలని,ఉచిత విద్యుత్తు మీటర్లు ఇచ్చారు కానీ వాటికి సంబంధించిన వైర్లు ప్లగ్గులు స్విచ్ బోర్డులు ఇవ్వలేదని అవి వెంటనే రజకులకు అందించాలని డిమాండ్ చేశారు.ఉచిత విద్యుత్ పథకం పై కరెంటు సిబ్బంది వేధింపులు జరుగుతున్నాయని వాటిని వెంటనే అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేసినమెడికల్ కాలేజీలో, ఇతర ప్రభుత్వ హాస్పిటల్లో, పోలీస్ స్టేషన్లో ఇతర దేవాలయాలల్లో, ఉద్యోగాలు రజకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నగర కంటి ప్రసాద్,కందుకూరి భుజంగరావు,ముదిగొండ తిరుపతి రావు,కందుకూరి నాగయ్య,కుప్పిల ప్రదీప్ కందుకూరు రాంబాబు,నగర్ కంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: